పాకిస్తాన్ తో మ్యాచ్ లో తిలక్ వర్మకు దక్కని చోటు … !

-

ఐపీఎల్ లో తన సత్తా చాటి ఇండియా సెలెక్టర్లు ఆకట్టుకుని వెస్ట్ ఇండీస్ తో జరిగిన సిరీస్ లో రాణించిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అనూహ్యంగా ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియ కప్ లో చోటు దక్కించుకున్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే సామర్ధ్యం మరియు అలవోకగా సిక్సులు కొట్టగలిగే స్టామినా ఉండడంతో తిలక్ వర్మపై సెలెక్టర్లు విశ్వాసం ఉంచి ఆసియ కప్ కు సెలెక్ట్ చేశారు. కానీ ఈ రోజు పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం చోటు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మ్యాచ్ లో తిలక్ వర్మ బెంచ్ కె పరిమితం కానున్నాడు. ఇక హై వోల్టేజ్ మ్యాచ్ గా జరుగుతున్న ఈ రోజు పాకిస్తాన్ పై ఇండియా విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇక ఇండియాలో కీలక ప్లేయర్లు అయిన రోహిత్, కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ ల పైనే గంపెడు ఆశలు అభిమానులు పెట్టుకున్నారు. మరి ఈ రోజు రాణించి పాకిస్తాన్ కు షాక్ ఇస్తారా ?

Read more RELATED
Recommended to you

Latest news