INDIA vs PAKISTAN: రేపు దాయాదుల సమరంలో సెంచరీ ల మోత మోగేనా ?

-

వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా రేపు ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యానం అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురుచూస్తుంటారు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇండియాపై గెలిచిన చరిత్ర అయితే లేదు. కానీ పాకిస్తాన్ బౌలింగ్ లో తడబాటుకు గురవుతున్నా బ్యాటింగ్ లో మాత్రం ఒకరు ఆడకపోతే ఇంకోరు ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నారు. ఇక ఇండియా వైపు రోహిత్ శర్మ ఆఫ్గనిస్తాన్ పై సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పాకిస్తాన్ కీపర్ రిజ్వాన్ మరియు షఫీక్ లు శ్రీలంక పై సెంచరీలు చేసి జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు.

ఇక రేపటి మ్యాచ్ లో రెండు జట్ల నుండి ఎన్ని సెంచరీ నమోదు కానున్నాయి అన్నది చూడాలి. రాహుల్ మరియు కోహ్లీలు ఆస్ట్రేలియా పై తృటిలో సెంచరీ లు మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news