తెలంగాణలో భారత రాజ్యాంగం నడవట్లేదు కెసిఆర్ రాజ్యాంగమే నడుస్తోంది – పొంగులేటి

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ చేసే యాత్ర భారత్ జూడో యాత్ర కాదు కాంగ్రెస్ బచావో యాత్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవట్లేదు కేసీఆర్ రాజ్యాంగమే నడుస్తుందని ఆరోపించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.

కెసిఆర్ వీఆర్ఎస్ తీసుకునే పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరొక నిజాం పాలన నడుస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కమ్యూనిస్టులు కమర్షియల్ ఇస్టులు అయ్యారని అన్నారు. కమ్యూనిస్టులు వ్యాపార సంస్థలుగా మారారని.. కమ్యూనిస్టులు , కమర్షియల్ల వల్ల కమర్షియల్ అఫ్ ఇండియా.. కమర్షియల్ అఫ్ మార్కస్ట్ గా అయ్యాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news