నా జోలికి వస్తే… నాలుక కోస్తా : రేవంత్ కు తెలంగాణ మంత్రి వార్నింగ్

-

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైతెలంగాణ మంత్రి ఏ .ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని..మాకు అలాంటి భాష రాదన్నారు. పోడు భూముల పై సీఎం కెసిఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. తన మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గొస్తానని రేవంత్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు.

A.Indrakaran-Reddy
A.Indrakaran-Reddy

ఇంతకు ముందు హెచ్చరించినా రేవంత్ స్వభావాన్ని మార్చుకోలేదని…సీఎం కెసిఆర్ అందరికీ దగ్గరవుతున్నారనే రేవంత్ కు ఈర్ష్య అని చురకలంటించారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలని..ఓటుకు నోటు దొంగవని అందరికీ తెలుసు అని చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నీకు పీసీసీ పదవి ఎలా వచ్చిందో కూడా తెలుసన్నారు. మరోసారి బరితెగించి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.  అసలు ఇంద్రవెల్లి లో ఎందుకు సభ పెట్టారో కాంగ్రెస్ నాయకులకే తెలియదని…హంతకులే సభ పెట్టడం తో ఆదివాసీల ఆత్మలు క్షోభిస్తున్నాయని ఫైర్ అయ్యారు ఇంద్రకరణ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news