ఇందిరా శోభన్ కీలక నిర్ణయం…హుజురాబాద్ లో ఉపాధి భరోసా యాత్ర

-

వైఎస్ షర్మిలా పార్టీ నుంచి వచ్చిన ఇందిరా శోభన్.. హుజురాబాద్ లో ఉపాధి భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్, నర్సులు, గెస్ట్ లెక్చరర్లకు మద్దతుగా ఉపాధి భరోసా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యాత్రపై ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సహా.. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని.. ప్రజా సమస్యలే అజెండాగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్దమవుతున్నానని తెలిపారు.

హరీష్ రావు భజాల పై తుపాకీ పెట్టి మాజీ మంత్రి  ఈటల రాజేందర్ ను కాల్చాలని కేసీఆర్ నిర్ణయించారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు కేటీఆర్ కు ఎందుకు ఇవ్వటం లేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని… నిరుద్యోగుల తరుపున మాత్రమే పోరాటం చేస్తానన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణ తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్, హరీష్ రావు కు దక్కుతుందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news