స‌ర్పంచ్ కుర్చీలో kurchoni వార్డు స‌భ్యుdi dadagiri : ద‌ళిత మ‌హిళా స‌ర్పంచ్‌కు అవ‌మానం..

-

ఏలూరు: దేవరపల్లి మండలం దుద్దుకూరులో వైసీపీ వార్డు సభ్యుడు కాండ్రు రామకృష్ణ రెచ్చిపోయారు. సర్పంచ్ కుర్చీలో కూర్చొని దాదాగిరి చేశారు. దళిత మహిళ నాగమణి దుద్దుకూరు సర్పంచ్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె కుర్చీలో కూర్చుని లేవనంటే లేవనని వార్డు సభ్యుడు హంగామా చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ హల్ చల్ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఉప సర్పంచ్‌పై తిరగబడ్డారు. అంతేకాదు సర్దిచెప్పేందుకు వచ్చిన ఉద్యోగులను కూడా దుర్భాషలాడారు. వార్డు సభ్యుడు రామకృష్ణకి పంచాయతీ కార్యదర్శి చెప్పినా కూడా సర్పంచ్ కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో రామకృష్ణ తీరుతో విసిగిపోయారు. కలెక్టర్‌కు ఉపసర్పంచ్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే సదరు రామకృష్ణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అండచూసుకుని రామకృష్ణ రెచ్చిపోతున్నారని, అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని వైసీపీకి చెందిన కింద స్థాయి  కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి వార్డు సభ్యుడు రామకృష్ణను కట్టడి చేయాలని, లేదంటే పార్టీ నష్టపోతోందని అంటున్నారు. మరి రామకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news