కాలేజీకి వెళ్లవా అని అడిగినందుకు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

-

కాలేజీకి ఎందుకు వెళ్లడం లేదని మందలించినందుకు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెలం జిల్లాలోని కరకగూడెం మండలం పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కలవలనగరం గ్రామానికి చెందిన కలం అక్షర (18) భద్రాచలంలో ఇంటర్మీడియట్ చదువుతోంది.

 

గత కొన్ని రోజుల ముందు ఇంటికి వచ్చిన అక్షర కాలేజీకి వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కాలేజీకి ఎప్పుడు వెళ్తావు అని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన అక్షర 15 రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మరల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం అక్షర మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news