Ram Charan: నిన్న‌ ధ‌ర‌మ్ తేజ్‌.. నేడు రామ్ చ‌ర‌ణ్ .. అస‌లేం చేస్తున్నారు?

-

Ram Charan: వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు యంగ్ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఇప్ప‌టికే ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రాజెక్టులు పూర్తి చేసి.. మ‌రో రెండు చిత్రాలు లైన్ లో పెట్టాడు. ప్ర‌స్తుతం అగ్ర దర్శకుడు శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్‌, సునీల్‌ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూనే లో జ‌రుగుతుంది. దాదాపు మూడు వారాల పాటు సాగునున్న‌ది. ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా.. చెర్రీ పాత్రపై ఇప్పటికే అనేక రూమార్స్ వినిపిస్తున్నాయి.

ఇందులో చెర్రీ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నర‌ని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో టక్‌ చేసుకుని, టై కట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. మరి రామ్‌చరణ్‌ పాత్ర ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవల విడుదలైన ‘రిపబ్లిక్‌’లో సాయితేజ్‌ కలెక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. చెర్రీ
ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news