ఇంట్రెస్టింగ్ అంటూ విశ్వక్ సేన్ పై.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంత అయితే సినిమాల ద్వారా పాపులారిటీని దక్కించుకున్నాడో.. అంతే వివాదాలలో ఇరుక్కుంటూ ఉంటాడు. మొన్నటికి మొన్న పాగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ9 యాంకర్ దేవి నాగవల్లితో గొడవ పెట్టుకుని నానా రచ్చ చేసిన విశ్వక్ సే.. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అక్కడ కూడా సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. అలా తన బిహేవియర్ తో ఒక మంచి ప్రాజెక్టును మిస్ చేసుకున్నాడు విశ్వక్ సేన్.. ఇదిలా ఉండగా ఈయనపై ఒక ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్లు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

ఓరి దేవుడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార మిథిలాపార్కర్. మొదటి సినిమాతోనే అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముంబై ముద్దుగుమ్మ.. కేవలం నటి మాత్రమే కాదు గాయని, రచయిత్రి కూడా.. ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా ఈమె పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఆఫర్లు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మిథిలా ఎన్నో విషయాలను పంచుకుంది. ” ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపిన మిథిలా.. విశ్వక్ సేన్ ‘పొట్టి నూడిల్స్’ అని పిలిచిన ప్రతిసారి తెగ నవ్వొచ్చేదని తెలిపింది.

విశ్వక్ సేన్ తో కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ”. ప్రస్తుతం మిథాలీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరొకవైపు ఒకప్పటితో పోల్చుకుంటే ఈ సమయం హీరోయిన్లకు స్వర్ణ యుగమని .. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా పారితోషకం కూడా డిమాండ్ చేయగలిగే స్థాయికి హీరోయిన్లు ఎదిగారు అని తెలిపింది. ఏది ఏమైనా మిథిలా చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news