చైనాకు భార‌త ర‌హ‌స్య స‌మాచారం.. ఆ జ‌ర్న‌లిస్టు ఎంత సంపాదించాడో తెలుసా..?

-

భార‌త‌ దేశ సరిహద్దు వ్యూహం, ఇండియ‌న్ ఆర్మీ మోహరింపులు వంటి కీలక సమాచారాన్ని చైనా గూఢచార విభాగాలకు అందజేశారన్న ఆరోపణలపై అరెస్టు అయిన ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టు రాజీవ్‌శర్మకు సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఢిల్లీ పోలీసులు వెల్ల‌డించారు. ఢిల్లీలోని పిటంపురకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రాజీవ్‌శ‌ర్మ‌ను 14న స్పెషల్‌ సెల్‌ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అంతేగాకుండా.. ఈ జర్నలిస్టుకు భారీగా లంచం ఇచ్చార‌న్న‌ ఆరోపణలపై చైనా మహిళ, నేపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్‌ సెల్‌ పోలీసులు తెలిపారు.

వీరి నుంచి పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సున్నిత సమాచారమున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌(స్పెషల్‌ సెల్‌) సంజీవ్ తెలిపారు. వెల్లడించారు.*రాజీవ్‌ 2016 నుంచి మైకేల్‌ అనే చైనా నిఘా విభాగం అధికారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 2018 వరకు భార‌త‌దేశానికి సంబంధించిన‌ కీలక సమాచారాన్ని అతడికి చేరవేశాడు. 2019 నుంచి చైనాకే చెందిన జార్జి అనే మరో నిఘా అధికారికి శర్మ కీలక రక్షణ సమాచారాన్ని అందజేస్తూ వచ్చాడు. ఇందుకు గత ఏడాదిన్నరలోనే రూ.45 లక్షల వరకు అందుకున్నాడు. సమాచారం అందజేసిన ప్రతిసారీ వెయ్యి డాలర్లు(సుమారు రూ.73 వేలు) ఇతడికి ముడుతుంటాయి’ అని ఆయన తెలిపారు.

అయితే.. రాజీవ్‌శ‌ర్మ‌కు ఇంత‌టి స‌మాచారం ఎలా తెలుస్తుంద‌ని అనుకుంటున్నారా..? గతంలో ఆయ‌న‌ వివిధ పత్రికల్లో పనిచేశారు. భారత పత్రికలతోపాటు చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికకు వ్యాసాలు రాస్తున్నాడని, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) గుర్తింపు కూడా ఉన్న ఇతడికి అనేక మంత్రిత్వ శాఖల్లోకి సులువుగా వెళ్లగలిగే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌(స్పెషల్‌ సెల్‌) సంజీవ్ అన్నారు. ఈ–మెయిల్‌ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా ఇతడు ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేశాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news