చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19మంది మృతి

-

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 2.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంత భాగం కూలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.

వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు దాదాపు 500 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిలో 19 మంది మృతి చెందారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. వీడియోలో అకస్మాత్తుగా రోడ్డు నేలలోకి దిగబడి పోవడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు లోతైన గోతిలో పడిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news