సూడాన్లో అంతర్యుద్ధం నెలకొంది. 114 మందికి పైగా మృతి చెందారు. ఆఫ్రికా దేశం సూడాన్లో ఇటీవల పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడికి దిగాయి. పశ్చిమ సూడాన్లోని నార్త్ డార్ఫర్లోని రెండు శిబిరాలపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లదించారు.

జాబ్జామ్లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా మృతి.. పలువురికి గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు బలగాలు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.