హైతీలో జైలు బద్దలు కొట్టి వందల మంది ఖైదీల పరారు!

-

హైతీ రాజధాని పోర్ట్‌ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలు బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు తప్పించుకొన్నారు. శనివారం రోజున జరిగిన ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్‌ యూనియన్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది.

రాజధానిలో ఉన్న అందరు అధికారులు తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారని, ఎవరినీ వదిలిపెట్టరు అని పోస్టులో పేర్కొంది.

కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోవడం కలకలం రేపుతోంది. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news