మోడీ ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోవడం లేదు : ఎంపీ బండి సంజయ్

-

కరీంనగర్ ఎంపీగా గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ దీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీనే కాదన్నారు. తాను రాముడిని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తానని.. ఓటర్లు తనకు ఓటు వేస్తే.. తాను నరేంద్ర మోడీకి ఓటు వేస్తానని చెప్పారు. మేము మేడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ఎవ్వరి పేరు చెప్పడం లేదు. మోడీ ప్రధానిగా లేని దేశాన్ని ఎవ్వరూ ఊహించుకోవడం లేదని తెలిపారు ఎంపీ బండి సంజయ్.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. కమలాపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. తరువాత నియోజకవర్గంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. కరీంనగర్ పార్లమెంటు చేసిన అభివృద్ధి పనులను వరిస్తున్నారు బండి సంజయ్. ముఖ్యంగా స్థానిక నేతలు, కార్యకర్తలకు కూడా జోష్ నింపుతున్నారు. వారికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news