BREAKING : నేపాల్ లో కూలిన హెలికాప్టర్ .. ఐదుగురు దుర్మరణం

-

నేపాల్‌ గగనతలంలో ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విమానం, హెలికాప్టర్లు కుప్పకూలుతున్న ఘటనలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి ఆ దేశంలో హెలికాప్టర్ కూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కాఠ్‌మండూ వాయువ్యంగా సైట్ సూర్య చౌర్లోని పర్వతాలలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ మహిళతో పాటు నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిపారు. కాఠ్‌మండూ ఎయిర్పోర్టు నుంచి బుధవారం మధ్యాహ్నం 1:54 గంటలకు శ్యప్రు బేషికి ఈ హెలికాప్టర్ బయల్దేరింది. ఈ క్రమంలోనే టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ ప్రమాదంలో నలుగురు చైనా పౌరులతో పాటు నేపాల్కు చెందిన పైలట్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు వారాల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో 18మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news