రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అజిత్​ ఢోబాల్​ భేటి

-

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ భేటీ అయినట్లు రష్యాలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. భారత్​-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించేందుకు కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించినట్లు తెలిపాయి. అఫ్గానిస్థాన్​పై రష్యా నిర్వహించిన ఐదో జాతీయ భద్రతా మండల కార్యాదర్శుల సమావేశం కోసం భారత జాతీయ సలహాదారు అజిత్ ఢోబాల్​ గురువారం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్​ను ఆయన కలుసుకున్నారు.

ఆ సమయంలో ఇరుదేశాలకు సంబంధించి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నట్లు మాస్కోలోని భారత రాయబారి కార్యాయలం ట్విటర్​ ద్వారా తెలిపింది. అఫ్గానిస్థాన్​ను ఏ దేశం కూడా ఉగ్రవాద ఎగుమతి దేశంగా ఉపయోగించుకోకూడదని అజిత్​ ఢోబాల్​ అన్నారు. అఫ్గాన్​లో ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అఫ్గాన్​ క్షిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని.. దీనికి అన్ని సభ్యదేశాల సహకారం అవసరమని పేర్కొన్నారు.

అఫ్గాన్​లోని ప్రజల పరిస్థితి రోజురోజుగా దిగజారుతోందని.. కొంచెం కూడా మెరుగు పడటం లేదని పుతిన్​ తెలిపారు. రష్యా నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌తో పాటు ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, చైనా, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news