ఉక్రెయిన్​పై విరుచుకుపడ్డ రష్యా.. 70 డ్రోన్లతో దాడి

-

ఉక్రెయిన్-రష్యాల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు రష్యా ఉక్రెయిన్​పై భీకర యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్​ కూడా తామేం తీసిపోమంటూ రష్యాపై తిరగబడుతోంది. ఇప్పటికే పలుమార్లు మాస్కోపై డ్రోన్ దాడులు చేసింది. ఏకంగా ఇటీవల కెర్చ్ జలసంధిలోని రష్యా చమురు నౌకపై దాడి చేసింది ఉక్రెయిన్. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా సమయం కోసం వేచి చూసింది.

తాజాగా శనివారం రాత్రి నుంచి రష్యా పశ్చిమ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఏకంగా 70 డ్రోన్లను పంపింది. క్షిపణుల వర్షం కురిపించింది. మూడు విడతలుగా జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందారు. కీవ్‌, ఖార్కివ్‌ నగరాలు.. దొనెట్స్క్‌ ప్రాంతం.. బాంబుల మోతతో అట్టుడికిపోయాయి. మరోవైపు మాస్కోను మళ్లీ ఉక్రెయిన్‌ డ్రోన్‌ వణికించింది. అయితే ఆ డ్రోన్‌ను రష్యా నేల కూల్చింది. డ్రోన్ల దాడి భయంతో వినుకోవా విమానాశ్రయంలో విమాన రాకపోకలను రష్యా.. ఆదివారం రోజున తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరు దేశాల యుద్ధంతో ఇప్పటికే రెండు దేశాలకు చెందిన చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news