తూర్పు అప్గానిస్తాన్ లో విషాదం.. పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం

-

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా.. పడవ బోల్తా పడిన 20 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహ్మంద్ దారా జిల్లాలో నదిని దాటుతుండగా బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వారంతా కూడా మునిగిపోయారని నంగరర్ ప్రావిన్స్ లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.

మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 25 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కేవలం ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మృతదేహాలు వెలికతీతకు రెస్క్యూ టీం రంగంలోకి ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news