కౌంటింగ్ రోజు వైసీపీ కుట్రలను తిప్పి కొట్టాలి : చంద్రబాబు

-

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం టీడీపీ, జనసేన,బీజేపీ నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. ఆదివారం  కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ  అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై  ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు యత్నించింది. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు. అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ ఏజెంట్లు పని చేయాలని సూచించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news