అందరూ ముందుకు రండి… విజ్ఞప్తి చేసిన ఐరాసా…!

-

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తిని అణిచివేసేందుకు అలాగే వచ్చే ఏడాదిలో ప్రాణాలను కాపాడటానికి కీలకమైన చికిత్సను అందించడానికి దేశాలు కలిసి రావాలని ఆయన కోరారు. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రపంచ భద్రతా ముప్పులో కరోనా వైరస్ నంబర్ వన్ అని ఆయన అభివర్ణించారు.

కరోనా వైరస్ మహమ్మారి మన జీవిత కాలంలోనే కాకుండా ప్రపంచానికే ఒక సంక్షోభం అని గుటెర్రెస్ అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం జనరల్ అసెంబ్లీ సెషన్ మిగతా వాటికి భిన్నంగా ఉంటుందన్నారు. అందరికీ సరసమైన ధరలకు అలాగే అందుబాటులో ఉండే టీకా మనకు అవసరమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 3 కోట్లు దాటిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news