ఐపీఎల్ 2023: “కోహ్లీ – మాక్స్ వెల్ – డుప్లెసిస్” లు ఆడితేనే RCB గెలుస్తుందా !

-

ఐపీఎల్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. ఇందులో నాలుగు మ్యాచ్ లలో గెలిచి , నాలుగింట ఓడింది. కాగా గత రాత్రి ఈ సీజన్ లో రెండవసారి కోల్కతా చేతిలో ఓటమి పాలయింది. అయితే గెలిచినా ఈ నాలుగు మ్యాచ్ లు కూడా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మరియు డుప్లెసిస్ లు బలమైన పునాదులు వేయడంతో మరియు సెకండ్ డౌన్ లో గ్లేన్ మాక్స్ వెల్ ధనా ధన్ ఇన్నింగ్స్ ల వలనే గెలుచుకుంటూ వచ్చింది. ఇక జట్టులో ఉన్న మిగిలిన ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లోమరర్, ప్రభుదేశాయ్ , హాసరంగా మరియు విల్లీ లు ఏ మ్యాచ్ లోనూ జట్టును అందుకోలేకపోయారు.

ముఖ్యంగా కీపర్ మరియు హిట్టర్ గా పేరున్న దినేష్ కార్తీక్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. దీనిని బట్టి వీరు ముగ్గురు ఫెయిల్ అయితే ఇక RCB ఆ మ్యాచ్ ఓడినట్లే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇంకా బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లను ప్రయత్నించి చూడాలని క్రికెట్ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news