IPL-2024: తెలుగు కామెంటేటర్స్ జాబితా విడుదల చేసిన జియో సినిమా

-

ఐపీఎల్ వస్తోందంటే చాలు ఇక క్రికెట్ అభిమానులకి పండగే. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే… ఈనెల 22వ తేదీ నుంచి మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024కు సంబంధించిన కామెంటేటర్స్ జాబితాను జియో సినిమా విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తో సహా 13 భాషల్లో ఉచితంగా మ్యాచ్లు చూడొచ్చని ప్రకటించింది. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

 

జియో సినిమా ప్రకటించిన తెలుగు కామెంటేటర్స్ వీళ్లే..

హనుమ విహారి, కళ్యాణ్ కొల్లారపు,వెంకటపతి రాజు, ఆశిశ్ రెడ్డి, సందీప్ బవనక, అక్షత్ రెడ్డి,ఆర్జే హేమంత్, ప్రత్యూష, ఆర్జే కౌషిక్, సునితా ఆనంద్.

Read more RELATED
Recommended to you

Latest news