సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన దేశానికి ఆదర్శం: మల్లు రవి

-

తెలంగాణ ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి అనే సృహతో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడని,ప్రతి నియమకాలలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారని డా .మల్లు రవి పేర్కొన్నారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసల వర్షం కురిపించారు.

కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయమని,రాష్ట్ర కేబినెట్ కూర్పు మొదలుకొని ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారుల వరకు, కార్పొరేషన్‌లలోను, కమిషన్‌లలోను, ప్రభుత్వ సలహదారుల అన్ని నియమకాలలో ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించిందని వెల్లడించారు. సీఎంఓ కార్యాలయంలో బ్రహ్మణ్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కులాల వారీగా అందరికి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news