IPL 2024 : ఆదుకున్న జడేజా… లక్నో టార్గెట్ ఎంతంటే ?

-

ఐపీఎల్ 2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జేయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

చెన్నై ఓపెనర్లలో రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు. అజింకే రహానే 36పరుగులు,గైక్వాడ్ 17 పరుగులు , దుబే 3, రైజ్వి 1 పరుగులకే అవుట్ అవ్వడంతో చెన్నై పీకల్లోకి కష్టాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, మొయినాలి చెన్నై సూపర్ కింగ్స్ను ఆదుకున్నారు. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించాడు.చివర్లో ధోనీ (28) మెరుపులతో చెన్నై ఆ మాత్రం స్కోరు సాధించింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య 2 వికెట్లు తీశారు. రవి బిష్ణోయి, స్టోఇనిస్, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు .

 

Read more RELATED
Recommended to you

Exit mobile version