IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 59వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే… ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠినమవుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెంట్స్… ప్లే ఆఫ్ కోసం కసిగా పోరాటం చేస్తున్నాయి. ఒకవేళ ఇందులో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రుతురాజ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, దూబే, మొయిన్ అలీ, జడేజా, ధోనీ, సాంట్నర్, సిమరీత్ సింగ్, శార్దూల్, తుషార్ దేశ్పాండే

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : గిల్, సాయి సుదర్శన్, షారుక్, మిల్లర్, మాథ్యూ వేడ్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్

Read more RELATED
Recommended to you

Latest news