IPL 2024 : రాణించిన గైక్వాడ్, దూబే… చెన్నై భారీ స్కోరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇక మొదటగా బ్యాటింగ్ దిగిన చెన్నై ఓపెనర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సీజన్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులు చేశాడు.

గైక్వాడ్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. మరో ఓపెనర్ అజింక్య రహనే ఒక్క పరుగు మాత్రమే చేశాడు.శివం దూబె 66(27 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. దీంతో చెన్నై 20ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసింది. మిచెల్(11), రవీంద్ర జడేజా (16) విఫలమయ్యారు. ధోనీ 4(1) రన్స్ చేశారు.ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మౌసిన్ ఖాన్ , యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news