IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జైపూర్లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభము కానుంది.

కాగా, టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచుల్లో గెలిచింది.రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్లో 8 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.

గుజరాత్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ : గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్, వేడ్, తెవాతియా, రషీద్, నూర్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్ శర్మ

రాజస్థాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ : యశస్వి, బట్లర్, సంజూ, పరాగ్, హెట్మయిర్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, కుల్డీప్ సేన్, చాహల్

 

 

Read more RELATED
Recommended to you

Latest news