IPL 2024 : వర్షం కారణంగా రేపటి మ్యాచ్ మ్యాచ్ రద్దు అయితే..?

-

లీగ్ స్టేజీలో దుమ్ము దులిపి పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుకున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నై లోని చపాక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే.. బీసీసీఐ రిజర్వ్ డే అందుబాటులో ఉంచింది. రేపు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. 27 న మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా వర్షం తగ్గకపోతే లీగ్ స్టేజీలో అత్యధిక పాయింట్లతో ఉన్న జట్టు ట్రోఫీ విజేతగా నిలుస్తుంది.అంటే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న కలకత్తా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియం ప్రాంతాల్లో ఎటువంటి వర్షం అంతరాయం కలిగించదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే రేపటి రోజు చెన్నైలో కేవలం 3 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news