IPL 2024 : ‘మా జట్టు బిగెస్ట్ సపోర్టర్ తో మ్యాచ్ విజేతలు’ …..ప్రీతి జింటాతో సెల్ఫీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు తొలి విజయం దక్కడంతో ఆ జట్టు కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా సందడి చేశారు. ఆ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె డగౌట్లో తన రియాక్షన్స్తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్ పై గెలిచిన తర్వాత పంజాబ్ ఆటగాళ్లు లివింగ్స్టోన్, సామ్ కరన్.. ప్రీతి జింటాతో సెల్ఫీ దిగారు. ‘మా జట్టు బిగెస్ట్ సపోర్టర్తో మ్యాచ్ విజేతలు’ అని ఆ ఫొటోను పంజాబ్ టీమ్ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.

కొత్త హోం గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ తొలి మ్యాచ్లోనే విజయం నమోదు చేసింది. చండీగఢ్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ను ఓడించింది. 175 పరుగుల టార్గెట్తో ఛేదనకు దిగిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. సామ్ కరన్ (63) హాఫ్ సెంచరీతో రాణించారు. పంజాబ్ తన హోం గ్రౌండ్ను మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఇటీవల మార్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news