IPL 2024 : పంజాబ్ కింగ్స్ కి షాక్… కీలక ఆటగాడు దూరం ?

-

వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్ కింగ్ కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆ టీం కెప్టెన్ శిఖర్ ధవన్ మరో 3 మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తగ్గకపోవడంతో మరో 10 రోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో సామ్ కరన్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. కాగా పంజాబ్ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి రెండింట్లో గెలుపొంది నాలుగింటిలో ఓటమి పాలైంది.

కాగా, ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరి వరకు కొనసాగిన ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.5 బందుల్లో లక్ష్యాన్ని చేదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version