రాత్రికి రాత్రి అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్…?

-

తమ టాప్ కమాండర్ ని అమెరికా చంపిన నేపధ్యంలో ఇరాన్ కక్ష సాధించుకోవడం మొదలుపెట్టింది. తమ దేశం మీద పెత్తనం చేలాయించాలని భావిస్తున్న అమెరికాను ఇరాక్ నుంచి పంపించాలని ఇరాన్ భావిస్తుంది. ఈ నేపధ్యంలో ఇరాక్‌లోని అల్ అసద్, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయాన్ని పెంటగాన్‌ ధ్రువీకరించింది. మంగళవారం రాత్రి ఈ దాడులు చేసింది ఇరాన్.

అల్ అసద్ స్థావరంపై తొమ్మిది క్షిపణులతో ఇరాన్ దాడిచేసినట్టు సమాచారం. మృతుల విషయమై ఇరాన్ అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. తాము జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ పేర్కొంది. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. మొత్తం 15 క్షిపణులతో దాడిచేసినట్టు తెలిపింది. అమెరికా ఆగకపోతే మాత్రం 100 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని,

ఈ దాడులను తీవ్ర తరం చేస్తామని ప్రకటించింది. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే ఈ దాడిలో భారీగా అమెరికాకు భారీగా నష్ట౦ జరిగిందని అంటున్నారు. దాదాపు 300 మందికి పైగా అమెరికా సైనికులు మరణించారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఇరాన్ మాత్రం అమెరికాకు చుక్కలు చూపించింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news