ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సాగునీరు అందడం లేదు – ఎమ్మెల్యే సండ్ర

-

ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సత్తుపల్లి, మధిర నియోజక వర్గాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కాలువ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కొంతమంది అధికారులు నీటి పంపిణీ విషయంలో సమన్వయ లోపంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎండాకాలంలో షట్టర్లు చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అవి చూడకుండా సిఈతో సహా అధికారులు అందరూ కార్యాలయాలలోనే కూర్చుంటున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ శాఖ లోని అధికారుల సమన్వయలోపంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.

రెండవ పంటలో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే సండ్ర. వారాబంది ఎత్తివేసి నిరాటంకంగా పది రోజులపాటు నీరు వదిలే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మానవ తప్పిదం, సమన్వయ లోపంతోనే రైతులు ఇబ్బంది పడాల్సివస్తుందన్నారు. ఇరిగేషన్ శాఖలో అన్ని ఒకే గొడుగు కిందకు వచ్చినప్పటికీ పూర్తి సమన్వయంతో ఉండాల్సిన అధికారులు అలా లేకపోవడంతో సత్తుపల్లి,మధిర నియోజకవర్గంలోని రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ఇరిగేషన్ శాఖలో ఉన్న లోపాన్ని ఉన్నతాధికారులు సరి చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news