గోదావరిలో దూకి ఇరిగేషన్ ఇంజినీర్ ఆత్మహత్య

-

నిజామాబాద్ జిల్లాకు చెందిన జలవనరుల శాఖ డీఈఈ వెంకట రమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నవీపేట్ మండలం ‘యంచ’ వద్ద గోదావరి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్మూర్ డివిజన్‌లో పనిచేసి కొన్నాళ్లుగా సెలవులో ఉన్న డీఈఈ.. హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. గురువారం రోజున నిజామాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన తర్వాత నవీపేట్ మండలం పోతంగల్‌లో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అక్కడే భోజనం చేసిన వెంకటరమణారావు.. హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఇవాళ ఉదయం గోదావరిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. గోదావరి నది వద్ద మోటార్‌ సైకిల్‌, చెప్పులు గుర్తించారు. వీటి ఆధారంగా మృతదేహం వెంకటరమణా రావుదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news