అతని కోసమే ధోనీ రిటైర్ అయ్యాడు.. ఇషాంత్ శర్మ..

-

భారత క్రికెట్ లో ధోనీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. భారత జట్టు కెప్టెన్ గా వన్డే ఇంటర్నేషన్ కప్ తో పాటు, టీ ట్వంటీ ప్రపంచ కప్ అందించి తనకంటూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే ధోనీ రిటైర్ మెంట్ గురించి చాలా వార్తలే వచ్చాయి. అవన్నీ అలా వస్తుండగానే సడెన్ గా రిటైర్ మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టెస్టులు, వన్డేలు సహా టీ ట్వంటీల్లో రిటైర్ మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు. తాజాగా ఇషాంత్ శర్మ మాట్లాడుతూ, వృద్ధిమాన్ సాహా కోసమే ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించాడని అన్నారు.

వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ అన్న సంగతి తెలిసిందే. అతని కోసమే ధోనీ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడని తనకి చెప్పాడని ఇషాంత్ అన్నాడు. తాను ఆడిన చివరి మ్యాచులో నేనుండాలని అనుకున్నారని, కానీ మోకాలి గాయంతో ఆ మ్యాచు ఆడలేకపోయానని, ఆడితే బాగుండేదని నాకూ అనిపిస్తుంటుందని ఇషాంత్ శర్మ మాట్లాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news