మహాదారుణం: హమాస్ లో 5800 మంది చిన్నారులు మృతి !

-

గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ కు మరియు హమాస్ ఉగ్రవాదులకు మధ్యన భారీగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట హమాస్ మిలిటెంట్లు దాడులు చేసి ఇజ్రాయెల్ లో పౌరులను మత్తు పెట్టగా, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై దాడులను మొదలుపెట్టింది. ఇక ఈ దాడులకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని రెండు దేశాలు ఒక ఒప్పందం ప్రకారం అంగీకరీంచాయి. ఈ గ్యాప్ లో గాజా కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల కారణంగా మొత్తం 5850 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ తెలిపింది. ఈ వార్త వింటూనే గుండెల్లో బాధ తక్కువస్తోంది.. ఎటువంటి అభం శుభం తెలియని చిన్న పిల్లలు స్వార్ధం కోసం జరిగిన యుద్ధంలో మరణించడం చాలా బాధాకరం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక ముందు అయినా యుద్ధం జరగకుండా ఆగిపోయేలా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలంటూ అందరూ కోరుకుంటున్నారు. మరి తొందరలోనే ఈ యుద్ధం గురించి గుడ్ న్యూస్ రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news