ఐటి హబ్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయి: బండి సంజయ్

-

మరో అయిదు రోజులు మాత్రమే ఓటర్ల మనసును మార్చడానికి ఉన్న సమయం.. ఆ తర్వాత రోజునే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కీలక నేతలు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ… BRS , కాంగ్రెస్ లది కబ్జాల చరిత్ర.. బీజేపీది పోరాటాల చరిత్ర అంటూ పవర్ ఫుల్ గా మాట్లాడారు. పేపర్ లీకేజీల వలన 60 లక్షల మంది యువత జీవితాలను నాశనం చేసిన పాపం కేసీఆర్ ది అంటూ బండి మండిపడ్డారు. ఇక కరీంనగర్ లో పెట్టిన ఐటి హబ్ లో ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి.. ఇప్పడు ఆ ప్లేస్ లో ఎలా ఉందంటే తొండలు గుడ్లు పెడుతున్నాయి అంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్.

ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే తెలంగాణను గట్టిగా అభివృద్ధి చేస్తాం.. ప్రజలను దోచుకు తిన్న గుండాలను తరిమి తరిమి కొడుతాం అంటూ బండి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news