ఇండియా మాజీ కోచ్: గిల్ ను సచిన్ లేదా కోహ్లీ లతో పోల్చవద్దు…

-

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోపీను కైవసం చేసుకుంది. కానీ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మాన్ గిల్ ను మాత్రం ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ ఐపీఎల్ లో గిల్ మూడు సెంచరీలు చేసి సీనియర్ క్రికెటర్ లు సైతం ముక్కున వేలేసుకునేలా ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన చూసిన ప్రపంచ మాజీ క్రికెటర్లు అప్పుడే ఇతన్ని సచిన్ అని కోహ్లీ అని పోల్చుతూ ఆక్సానాయికి ఎత్తేస్తున్నారు. ఈ పొగడ్తలపై గుజరాత్ టైటాన్స్ కోచ్ గ్యారీ క్రిస్టెన్ స్పందించాడు.

ప్రస్తుతం శుబ్ మాన్ గిల్ తన కెరీర్ లో ఇంకా మొదటి దశలోనే ఉన్నాడని, అప్పుడే గిల్ ను సచిన్ కోహ్లీ లాంటి క్రికెటర్ లతో పోల్చవద్దని చెప్పాడు. కాగా ఇతన్ని పొగుడ్తున్నవాళ్ళు ఇందులో అర్ధాన్ని గ్రహిస్తారని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news