ఏడుకొండల వాడికి ఏడు శనివారాలు పూజ చేస్తే ఎంతో మంచిది..!

-

శనివారం నాడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తులని రక్షించే ఆపద్బాంధవుడు, అనాధరక్షకుడు. అయితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల చక్కటి ఫలితం మనం పొందవచ్చు. అదే విధంగా ఎలాంటి దోషాలు కూడా రావు.

Venkateswara-Swamy
Venkateswara-Swamy

వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషం కూడా పోతుంది. అయితే శని దోషం పోవాలంటే కచ్చితంగా ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదే ఒకవేళ మహిళలకి వీలుకానప్పుడు ఆ వారం పూజ చేయలేకపోయినా మరుసటి వారం చేయొచ్చు. అయితే వెంకటేశ్వర స్వామి శనివారం ఎలా పూజించాలి..?, ఏడు వారాలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

శనివారం నాడు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకుని, స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటిపండు వేసి చపాతీలా చేసుకోవాలి. దానిలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి.

ఆరోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. అలానే శనివారం నాడు ఆవునేతితో కానీ నువ్వుల నూ నెతో కానీ దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు పొందచ్చు. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా ఏడు వారాల పాటు ఏడుకొండలవాడిని పూజిస్తే ఎలాంటి సమస్యలనైనా బయటపడొచ్చు. సుఖ సంతోషాలతో ఉండచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news