“ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” టీజర్ రిలీజ్.. ఎలక్షన్ అధికారిగా అదరగొట్టిన నరేష్

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. కాగా సినిమాలో వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.

Read more RELATED
Recommended to you

Latest news