రేవంత్ ప్రభుత్వం పై జానా రెడ్డి ప్రశంశలు..!

-

రేవంత్ ప్రభుత్వం పై జానా రెడ్డి ప్రశంశలు కురిపించారు. నెల రోజుల పాలన చూస్తుంటే సంతోషంగా ఉంది అని చెప్పారు. ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళ్తుంది అని జానా రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావం మాలో కలిగింది అని చెప్పారు. అలానే ఇదే ఒరవడిని కొనసాగించాలని… మేదావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలి అని ఆయన అన్నారు.

గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు ప్రశంసించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని కూడా ఆయన అన్నారు. అంతే కాక ఈ ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వహిస్తా అని అన్నారు. గతంలో నేను నాయకత్వం వహించినా కూడా ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పనిచేస్తా అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news