మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమే – జగదీష్ రెడ్డి

-

మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమేనని విమర్శలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.  మునుగోడులో మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కెసిఆర్, తెరాస గురుంచి మాట్లాడే అర్హత రాజ్ గోపాల్ రెడ్డికి లేదని.. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బిజేపి పంచన చేరాడని మండిపడ్డారు. తెరాస లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

అభివృద్ధి కోసం వచ్చారని.. కాంట్రాక్ట్ లు ఇస్తే తెరాస లోకి వస్తా అన్నది నువ్వేనన్నారు. నువ్వు దొంగవు…. ప్రజా ద్రోహివి… నీ స్వార్థం కోసమే రాజకీయాలు అని.. దొంగలకు, ద్రోహులకు, గుతే దారులకు ….. మునుగోడు ప్రజల చైతన్యాన్ని మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని మండిపడ్డారు.

రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమే ఖాయమని.. సంక్షేమ పథకాలు ను వద్దంటున్న బిజేపి లో నువ్వు చేరుతున్నావని పేర్కొన్నారు. నీ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని.. దేశ ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న మోడీ పై అన్ని విషయాలను సభ ద్వారా కెసిఆర్ వివరిస్తారని వివరించారు. అన్ని మండలాల్లో గ్రామాల నుంచి ప్రజలు స్వచఛందంగా తరలి రావడానికి సిద్దం అవుతున్నారని.. మునుగోడు సభతోనే ఇక్కడ ప్రజల అభిప్రాయం స్పష్టం కానుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news