మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ : వైఎస్ జగన్

-

మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ…’అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడు. నేను సంక్షేమానికి వినియోగించాను. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి అని అన్నారు.

రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు.80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా ?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా ?అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడాపక్కా ఇళ్లు నిర్మించాడా ?ఏపీని సింగపూర్‌గా మార్చాడా ?ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా ? అని ప్రశ్నించారు.ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్‌ కారంటూ వస్తున్నాడు అని విమర్శించారు.చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా’ అంటూ ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news