ఏపీ – తెలంగాణా బస్సుల విషయంలో జగన్ కీలక ఆదేశాలు !

-

ఏపీ – తెలంగాణా బస్సుల విషయంలో జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఉదయం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్యాబినెట్ సమావేశంలో ఎం వైఎస్ జగన్ దృష్టికి పలు అంశాలను మంత్రులు తీసుకు వెళ్లారు. అందులో మరీ ముఖ్యంగా తెలంగాణకు బస్సుల రవాణా అంశాన్ని సీఎం దృష్టికి పేర్ని నాని, బొత్సలు తీసుకు వెళ్లారు.

దీంతో స్పందించిన జగన్ హైదరాబాద్‌ కు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే ఈ విషయం తెగక పోతే న్యాయ సలహా అయినా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఇక బస్సులు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం ముందు నుండీ సుముఖంగానే ఉన్నా ఎందుకో తెలంగాణా ప్రభుత్వ అధికారులు మాత్రం ఏదో ఒక వంక పెడుతున్నారు. అందుకే న్యాయ సలహా తీసుకోమని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పటికి అయినా ఈ బస్సుల సంగతి తేలుతుందో లేదో ?

Read more RELATED
Recommended to you

Latest news