ఆరోగ్య శాఖ మీద సమీక్ష.. జగన్ కీలక ఆదేశాలు

-

ఈ రోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఆరోగ్య శాఖ – నాడు నేడు మీద సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాల్లో నాడు – నేడు ప్రతిష్టాత్మకంగా చేపట్టామని అన్నారు. నాడు – నేడు పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పేషెంట్ కు ఇచ్చిన గది, పడక, భోజనం ఆస్పత్రి వాతావరణాల్లో ఖచ్చితంగా మార్పు కనిపించాలి అని జగన్ ఆదేశించారు. అనంతరం ఏపీలో కోవిడ్ పరిస్థితుల మీద సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దీంతో ప్రస్తుతం కరోనా పరిస్థితి మీద జగన్ కు వివరాలు అందించారు అధికారులు. ఇంకా 69 ఆసుపత్రులలో 9625 బెడ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కరోనా ఉధృతి లేకపోయినా అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు.  

Read more RELATED
Recommended to you

Latest news