జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2వేలు..

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వినూత్న పథకాలకు ఊపిరిపోసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడ‌ల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న‌డుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జలకు మేలు చేకూర్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడడం లేదు.

ఇక‌ తాజ‌గా ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు అందించింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయనుంది. పీఎం కిసాన్‌ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది.సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లకు సొమ్ము అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news