ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు రిలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన జగన్ సర్కార్

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

ఇందులో భాగంగానే… జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఏబీ వెంటకేశ్వరరావు సర్వీసులో ఉన్నట్టు జీవోలో పేర్కొన్న ప్రభుత్వం… ఏబీవీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని.. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి డ్యూటీలో ఉన్నట్టే పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ మరియు ఇతర ప్రతి పక్ష పార్టీలన్నీ.. హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news