మళ్ళీ ఢిల్లీకి జగన్.. కానీ అందుకేనా ?

-

రేపు లేదా ఎల్లుండి మళ్ళీ ఢిల్లీ వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, అలానే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన మోడీని కలిసి వారం కూడా కాలేదు ఈలోపే మరోసారి ప్రధాని అపాయింట్మెంట్ ని సీఎం జగన్ కోరడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రధాని అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. జగన్ ఏకంగా ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మరో సుప్రీం న్యాయామూర్తి గురించి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఈ అంశం మీదనే మాట్లాడాలని అనుకుంటున్నారా ? లేక మరేదైనా అంశం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇలా వారంలో మళ్ళీ అపాయింట్మెంట్ కోరడమే చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news