వైసీపీ నేతల భూములను కూడా జగన్‌ వదలరు : చంద్రబాబు

-

సూపర్‌ సిక్స్‌, మోడీ హమీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని ఆయన స్పష్టం చేశారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు.

వైసీపీ నేతల భూములను కూడా జగన్‌ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మంచినీళ్లు రాలేదని అడిగినందుకు గర్భిణిపై .. తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి సాక్షిగా దాడి చేశారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఏం చేస్తున్నారని ,పాపాల పెద్దిరెడ్డికి టైమ్‌ దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చారు . పెద్దిరెడ్డిది ఎర్రచందనం, మైనింగ్‌, ఇసుక మాఫియా అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news