చిరువ్యాపారులకు షాక్..”జగనన్న తోడు” పథకం వాయిదా..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీన ఈ పథకం మూడో దశ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. అయితే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీన తలపెట్టిన జగనన్న తోడు మూడవ విడత సహాయం అందజేత కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేసింది సర్కార్.

ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ సెక్రటరీ, కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా రాష్ట్రప్రభుత్వం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లో అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. కాగా..  మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న ఉదయం 9 గంటల సమయంలో.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news