తల్లి మాట కోసం మంచి మనసు చాటుకున్న జగపతిబాబు..!

-

మనం ఈ భూమి మీదకు రావడానికి కారణం తల్లి.. అలాంటి తల్లి కోరిక కోరితే ఏ పిల్లలైనా కాదంటారా? ఈ క్రమంలోనే జగపతిబాబు కూడా తన తల్లి ఇచ్చిన మాటను నెరవేర్చుతూ తన మంచి మనసు చాటుకున్నారు. ఒకప్పుడు విలన్ గా.. కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతిబాబు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత నటసింహ బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా రీఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో పాటు మరెన్నో చిత్రాలలో విలన్ గా విశ్వరూపం చూపించారు జగపతిబాబు.

ఒకవైపు సినిమాలలో విలన్ గా నటిస్తూనే మరొకవైపు హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా జగపతిబాబు చేసిన సేవా కార్యక్రమాల గురించి బయట పెద్దగా చెప్పుకోరు. చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. కానీ తాజాగా ఒక పేద విద్యార్థినికి చేసిన సాయం తెలిసి ప్రతి ఒక్కరు ఈయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. అసలు విషయం ఏమిటంటే .. సైదాబాదుకు చెందిన జయలక్ష్మి అనే విద్యార్థినికి జగపతిబాబు అండగా నిలిచారు.

జయలక్ష్మి ప్రస్తుతం వరల్డ్ చిల్డ్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తోంది. డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. అయితే సివిల్స్ చదవాలని చూస్తూన్న ఈమెకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తున్నాయి. ఆమెను చదివించడానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు . అయితే ఇటీవల జయలక్ష్మి గురించి ఒక ప్రముఖ దినపత్రికలో ఆర్టికల్ రాగా.. అది చూసిన జగపతిబాబు తల్లి ఆమెకు సహాయం చేయాలని జగపతిబాబుకు సూచించింది. అమ్మ అడిగితే కాదంటారా ? వెంటనే ఆమెకు సాయం చేస్తానని జయలక్ష్మి ఇంటికి పిలిపించి సివిల్స్ అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని .. అయితే కష్టపడి చదవాలని ఆమెకు జగపతిబాబు సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news